కేటీఆర్.. దమ్ముంటే ఒక్క సీటు గెల్వు : రేవంత్ రెడ్డి

కేటీఆర్.. దమ్ముంటే ఒక్క సీటు గెల్వు : రేవంత్ రెడ్డి
  • నువ్వు వస్తవో, నీ అయ్య వస్తడో రండి
  • చేవెళ్ల సభలో సీఎం రేవంత్ రెడ్డి సవాల్ 
  • మేం అల్లాటప్పగాళ్లం కాదు.. నీ లెక్క అయ్య పేరు చెప్పుకుని కుర్చీలో కూసోలే 
  • మిమ్మల్ని బొందవెట్టి కుర్చీలో కూసున్నం  
  • అడవిపందుల్లా దోచుకుంటే జనం చెప్పుతో కొట్టిన్రు.. అయినా మీకు బుద్ధి రాలే
  • యూట్యూబ్ పెట్టుకుంటవా పెట్టుకో.. మాకు ఏ ట్యూబ్ అక్కర్లే.. 
  • నీ ట్యూబ్​లైట్​ మాత్రం పగులగొడ్తం 
  • కేడీ, మోదీ ఒక్కటే.. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉన్నది
  • ఇప్పటికే 25 వేల ఉద్యోగాలు ఇచ్చినం.. మార్చి 2న మరో 6 వేలు ఇస్తమని వెల్లడి

హైదరాబాద్, వెలుగు : వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఒక్క సీటైనా గెలిచి చూపించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్​కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. మంగళవారం చేవెళ్లలో నిర్వహించిన ‘జనజాతర’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్, కేటీఆర్​పై మండిపడ్డారు. పదేండ్లు అడవిపందుల్లాగా తెలంగాణను కేసీఆర్ కుటుంబం దోచుకున్నదని అన్నారు. అందుకే వాళ్లను ప్రజలు చెప్పుతో కొట్టారని, అయినా వాళ్లకు బుద్ధి రాలేదని ఫైర్ అయ్యారు. 

‘‘రేవంత్​రెడ్డి సీఎం అని ముందే ప్రకటిస్తే కాంగ్రెస్​కు మూడు సీట్లు కూడా రాకపోతుండే అని కేటీఆర్ అంటున్నడు. ఇప్పుడు నేనే సీఎం, పీసీసీ ప్రెసిడెంట్. నా నాయకత్వంలోనే పార్లమెంట్​ఎన్నికలకు పోతున్నం. కేటీఆర్..​ నీకు చేతనైతే, దమ్ముంటే ఒక్క ఎంపీ సీటైనా గెలిపించి సూపెట్టు. నువ్వు వస్తవో, నీ అయ్య వస్తడో రండి..” అని సవాల్ విసిరారు. 

ప్రభుత్వం పడిపోతదంటూ బీఆర్ఎస్ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని మండిపడ్డారు. ‘‘ఒక్కరోజైనా తండ్రి నోటైనా, కొడుకు నోటైనా, అల్లుడి నోటైనా, బిడ్డ నోటైనా, వాని సుట్టపోని నోటైనా ఈ ప్రభుత్వం మంచి పని చేసిందని మాట్లాడిన్రా? పొద్దునలేస్తే గవే చెత్త మాటలు, సొల్లు మాటలు. ఎప్పుడీ ప్రభుత్వం పోతదా? ఎప్పుడు మేం కూసుంటమా? అన్నట్టుగా చూస్తున్నరు. ఒకాయన ఈ ప్రభుత్వం మూడు నెలలు కూడా ఉండదని అంటున్నడు. ఇంకొకాయన ఆరు నెలలు కూడా ఉండదని అంటున్నడు. 

ఎవడైనా ఊళ్లకు వచ్చి అట్ల అంటే, మా కార్యర్తలు వాళ్లను పట్టుకుని యాపచెట్టుకు కట్టేసి లాగుల తొండలిడిసి కొడ్తరు” అని హెచ్చరించారు. ‘‘సోషల్​మీడియా ఉంటే మేం గెలిచేటోళ్లమని కేటీఆర్ అంటున్నడు. ఉన్న టీవీలన్నీ మీ సుట్టపోళ్లవే కదా. మాకేమన్నా టీవీ ఉన్నదా? పేపర్ ఉన్నదా? మా అయ్య మాకు టీవీ ఇచ్చిండా? రాసుకోవడానికి పేపర్ ఇచ్చిండా? సాయంత్రం పూట సేదదీరడానికి జూబ్లీహిల్స్​లో సినిమా వాళ్ల గెస్ట్​హౌస్​లు ఏమైనా ఇచ్చిండా? మా కార్యకర్తలు కష్టపడితే అధికారం వచ్చింది. ఇక చివరికి యూట్యూబ్ పెట్టుకుంటనని కేటీఆర్ అంటున్నడు. మాకు ఏ ట్యూబ్ అక్కర్లేదు.. నీ ట్యూబ్ లైట్​ మాత్రం పగులకొడ్తం. యూట్యూబ్ చానల్​​తో పాటు కృష్ణా నగర్​లో ఏదైనా బ్రోకర్​దందా పెట్టుకో. అది, ఇది కలిస్తే బాగానే నడుస్తది నీ వ్యాపారం” అని అన్నారు.  

కార్యకర్తల పోరాటంతోనే ఇందిరమ్మ రాజ్యం..  

సోనియమ్మ మాట శిలాశాసనమని, తమ ఊపిరిపోయినా ఆమె ఇచ్చిన హామీలన్నీ అమలు చేసి తీరుతామని రేవంత్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండ్రోజుల్లోనే రెండు హామీలు అమలు చేశామని.. ఇప్పుడు రూ.500కే గ్యాస్​సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అమలు చేస్తున్నామని చెప్పారు. ‘‘ప్రియాంకగాంధీ చేతుల మీదుగా ఉచిత కరెంట్, రూ.500కే గ్యాస్​సిలిండర్​పథకాలు ప్రారంభించాలని అనుకున్నాం. కానీ మహబూబ్​నగర్​స్థానిక సంస్థల ఎన్నికల కోడ్​రావడంతో సెక్రటేరియెట్​లో పథకాలను ప్రారంభించాం. కేంద్రంలో మోదీ, రాష్ట్రంలో కేసీఆర్​ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.400 ఉన్న గ్యాస్​సిలిండర్​ధరను రూ.1,200కు  పెంచారు. ప్రతి ఆడబిడ్డకు కట్టెల పొయ్యి నుంచి విముక్తి కల్పించాలనే రూ.500కే గ్యాస్ అందిస్తున్నం. 40 లక్షల మందిని అర్హులుగా గుర్తించాం. ఇంకా ఎవరికైనా రాకుంటే ఎమ్మార్వో, ఎంపీడీవో దగ్గరికి వెళ్లి అడగండి. జర్నలిస్టులకు కూడా రూ.500కే గ్యాస్​ సిలిండర్లు ఇస్తాం” అని వెల్లడించారు.

 ‘‘ఇక్కడున్న వాళ్లందరూ గత ప్రభుత్వంలో వేధింపులు, అణచివేతకు గురైనేవారే. కేసీఆర్​ ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, ఆస్తులు ఆక్రమించుకున్నా.. నిటారుగా నిలబడి కొట్లాడి కాంగ్రెస్ ను గెలిపించారు. మీరంతా కష్టపడే ఇందిరమ్మ రాజ్యం తెచ్చారు. మీరు భుజాలపై మోసిన్రు కాబట్టే నేను ముఖ్యమంత్రిగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్న. మీ త్యాగాలను ఎప్పటికీ మరువం. మీ రుణం తీర్చుకునే సందర్భం వచ్చింది. మిమ్మల్ని ఆదుకునే బాధ్యత పార్టీపై, నాపై ఉంది. తుక్కుగూడలో సెప్టెంబర్​ 17న సోనియమ్మ ఆరు గ్యారంటీలను రాష్ట్ర ప్రజలకు ఇచ్చింది. ఆ ఆరు గ్యారంటీలను అమలు చేస్తాం. పేదలకు మంచి చేయాలనేదే మా ఆలోచన. మేడారం జాతరకు కూడా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తే లక్షలాది మంది జాతరకు వెళ్లారు” అని అన్నారు. 

అన్ని ఎంపీ సీట్లు గెల్వాలే.. 

రాష్ట్రంలోని అన్ని ఎంపీ సీట్లలో కాంగ్రెస్ ను గెలిపించాలని రేవంత్ పిలుపునిచ్చారు. ‘‘పార్లమెంట్​ఎన్నికల్లో ఒక్క సీటైనా గెల్వు అని ఇప్పుడే బోడి లింగానికి సవాల్​విసిరిన. ఇది నా ఒక్కడితోనే అయితదా.. కార్యకర్తలందరూ కలిసి రావాలే. అందరం కష్టపడి పని చేస్తే అన్ని ఎంపీ సీట్లలో మనవాళ్లను గెలిపించి ఢిల్లీకి పంపిస్తాం” అని చెప్పారు. ‘‘క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలను వార్డు మెంబర్లు, సర్పంచుల నుంచి జిల్లా పరిషత్ చైర్మన్​ ల వరకు గెలిపించే బాధ్యత నాదే. త్వరలోనే నామినేటెడ్​పోస్టులు కూడా భర్తీ చేస్తాం. కార్యకర్తలతో ఇందిరమ్మ కమిటీలు వేసి ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలన్నీ వారి ద్వారానే అమలు చేస్తాం. నేను కార్యకర్తల్లో ఒకడిని. 75 రోజుల్లో ఏ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోలే. ఎవరు వచ్చినా కలుస్తున్న.. కొన్నిసార్లు కలవడం కుదరకపోవచ్చు. తొందరలోనే నియోజకవర్గాలు, జిల్లాల్లో తిరగడానికి వస్తా.. మీరు కోరుకుంటున్నట్టుగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు నడిపించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది” అని అన్నారు. ప్రాణహిత – చేవెళ్లను పూర్తి చేసి ప్రతి ఎకరానికి నీళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. 

గుజరాత్ మోడల్ అంటే ఇదేనా? 

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉన్నదని రేవంత్ ఆరోపించారు. ‘‘బీజేపీ వాళ్లు రుబాబుతో మాట్లాడుతున్నరు. వాళ్లు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన్రు ఏమైనయ్.  కేడీ, మోదీ ఇన్నాళ్లు కలిసే అంటకాగిన్రు కదా.. అలైబలై తీసుకున్నరు కదా.. వాళ్లిద్దరి మధ్య చీకటి ఒప్పందం లేకుంటే కేటీఆర్​ను సీఎం చేస్తానని కేసీఆర్​ఎందుకు మోదీని అడుగతడు.. అంటే వాళ్ల కుల పెద్ద ఎవరు మోదీనే కదా.. కాంగ్రెస్​ను తట్టుకోవాలంటే చీకట్ల కలిసుండాలే... పొద్దంత కొట్లాడాలే అన్నట్టుగా వాళ్లు కలిసే చేస్తున్నరు” అని విమర్శించారు. ‘‘గుజరాత్ మోడల్ అంటే తగులపెట్టుడా? పెట్టుబడులు ఇతర రాష్ట్రాల నుంచి గుంజుకపోవుడా? ఢిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులను కాల్చి చంపుడా? గుజరాత్ మోడల్​ అంటే పేదలను ఆదుకోవాలి. ప్రతి పేదవాడికి ఇల్లు కట్టివ్వాలి. సాగునీళ్లు ఇవ్వాలి. కానీ పార్టీలు చీల్చడం.. ప్రభుత్వాలను పడగొట్టుడు కాదు” అని అన్నారు. ‘‘మన పార్టీ మీటింగ్​ఉంటే ముందు ఎన్ఎస్ యూఐ, యూత్​కాంగ్రెస్​, ఇతర అనుబంధ సంఘాలవాళ్లు వస్తరు. కానీ మోదీ ఎక్కడికి పోవాలన్నా ముందు ఐటీ, ఈడీ, సీబీఐని ఆ రాష్ట్రానికి తోలుతరు. అక్కడున్న లీడర్లను భయపెట్టి పార్టీల చేర్చుకుంటరు. ఇక్కడ బీజేపీలో ఉన్న మనిషి మంచోడే కానీ ఆయన ఉన్న పార్టీ మంచిది కాదు. కవితను జైలులో వేస్తరని బీజేపీలో చేరితే, వెయ్యలేదని ఆయనే చెప్పిండు. ఆయనకు ఓటేస్తే ఏం రాదు. కాంగ్రెస్ కే వేయాలి” అని కోరారు.

కరెంటు వస్తుందో.. లేదో.. తీగలు పట్టుకొని చూడండి : భట్టి

‘‘కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ వాళ్లు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయ రు.. కరెంటు ఉండదు అని హరీశ్ రావు, కేటీఆర్‌‌‌‌‌‌‌‌ అంటున్నరు.. నేను వారికి ఒకటే మాట చెప్తున్నా.. ఈ రాష్ట్రంలో ఏ మూలకైనా వెళ్దాం.. కరెంటు ఉండదని చెప్పే ఏ నాయకుడైనా అక్కడికి వచ్చి తీగలు పట్టుకుని చూడండి. కరెంటు ఉందో లేదో స్పష్టంగా తెలుస్తుంది” అని భట్టి అన్నారు. ప్రాణహిత–చేవెళ్ల’ ప్రాజెక్టును రాకుండా చేసిన బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ పార్టీని చేవెళ్ల ప్రాంత ప్రజలు నిలదీయాలని  భట్టి పిలుపు నిచ్చారు.  కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు గోదావరిలో పోశారని మండిపడ్డారు.  

ఉద్యోగాలిస్తే వాళ్ల కడుపులు మండుతున్నయ్.. 

తమ ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తుంటే, బీఆర్ఎస్ వాళ్ల కడుపులు మండుతున్నాయని రేవంత్ మండిపడ్డారు. ‘‘తెలంగాణ వస్తే నీళ్లు, నిధులు, నియామకాల్లో న్యాయం జరుగుతుందని ఉద్యమం టైమ్ లో కేసీఆర్ చెప్పారు. కానీ నీళ్ల ముసుగులో నిధుల దోపిడీ జరిగింది. కేసీఆర్ కుటుంబానికే ఉద్యోగాలు దక్కాయి. మేం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోపే 25 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందజేశాం. మార్చి 2న ఇంకో 6 వేల ఉద్యోగాలు భర్తీ చేయబోతున్నాం. ఇది చూసి ఓర్వలేకనే కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావు, కవిత రావు, దయాకర్​రావు, వినోద్​రావు.. మా ప్రభుత్వంపై నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు” అని ఫైర్ అయ్యారు. ‘‘పేద బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తుంటే మీ కడుపులు మండుతున్నయా? నీ బిడ్డను నిజామాబాద్​ ప్రజలు బండకేసి కొడితే, ఆరు నెలల్లోనే ఎమ్మెల్సీ చేసినవ్. నీ సుట్టపోడు వినోద్​ను కరీంనగర్​ ప్రజలు ఓడగొడితే ప్లానింగ్ బోర్డు వైస్​ చైర్మన్​ఇచ్చినవ్. నీ బిడ్డలకు ఉద్యోగాలు లేకపోతే నీకు ఏడుపొచ్చింది. మరి పదేండ్లు పేదోళ్ల బిడ్డలకు ఉద్యోగాలు రాక చెట్లకు ఉరేసుకొని చచ్చిపోతుంటే ఏం చేసినవ్? పరీక్ష పేపర్లు జిరాక్స్ సెంటర్లల్ల పల్లీబఠానీలకు అమ్మినట్టు అమ్మితే ఆ దొంగలను ఏం చేసినవ్?” అని కేసీఆర్ ను ప్రశ్నించారు. తాము వచ్చినంక ఆ దొంగలను అరెస్టు చేసి జైళ్లో పెట్టినమని చెప్పారు. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్​ వేస్తామని వెల్లడించారు. 

కాంగ్రెస్​ను టచ్ చేస్తే మాడి మసైతరు : పొన్నం

ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు కాకముందే ప్రతిపక్ష నేతలు శాపనార్థాలు పెడుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ప్రజలంతా ఏకమై నియంతృత్వ ప్రభుత్వాన్ని గద్దె దింపి, ప్రజా ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని చెప్పారు. అలాంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టచ్ చేస్తే మాడి మసైతరని హెచ్చరించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అమలు కాని హామీలు ఎన్నో ఉన్నాయని వాటిపై చర్చిద్దామా అని సవాల్ విసిరారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. విభజన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చిందా అని ప్రశ్నించారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచామని రెస్ట్ తీసుకోవద్దని, వచ్చే ఎంపీ, లోకల్ బాడీ ఎన్నికల వరకు పోరాడి కాంగ్రెస్ ను గెలిపించాలని కార్యకర్తలు కోరారు. కేసీఆర్ అవినీతిని గ్రామ గ్రామనికి తీసుకెళ్లాలని, బీజేపీ, బీఆర్ఎస్ నేతల విమర్శలు తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.


హేళన చేసినోళ్లు అడ్రస్‌‌‌‌‌‌‌‌ లేకుండా పోయిన్రు: సీతక్క

కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ గ్యారంటీలకు వారంటీ లేదు.. కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌కే గ్యారంటీ లేదు అని తప్పుడు కూతలు కూసిన వాళ్లు ఈ రోజు అడ్రస్‌‌‌‌‌‌‌‌ లేకుండా పో యారని మంత్రి సీతక్క అన్నారు. అధికారంలోకి వచ్చి.. మంత్రి వర్గం ప్రమాణం చేసిన తర్వాత రెండో రోజే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశామన్నారు. ఇప్పుడు రూ.500 గ్యాస్‌‌‌‌‌‌‌‌ సిలిండర్‌‌‌‌‌‌‌‌, 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌‌‌‌‌‌‌‌ను అందిస్తున్నామన్నారు. మాటను నిలబెట్టుకుంటూ వస్తుంటే బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌, బీజేపీ ఓర్వలేక పోతున్నాయని విమర్శించా రు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేస్తుంటే.. ఆటో డ్రైవర్ సోదరులను రెచ్చగొట్టి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నర ని ఆరోపించారు. గ్యారంటీలు అమలు చేయండి అని పైకి ప్రశ్నిస్తూ.. లోపల అమలు కాకుంటే బా గుండని అసహనానికి గురవుతున్నారని విమర్శించారు. సంక్షేమంలో విప్లవాత్మకమైన పథకాలు తీసుకువస్తున్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీని లోక్​సభ ఎన్నికల్లో దీవించి ఘన విజయం చేకూర్చాలని ప్రజలను కోరారు. 

17 ఎంపీ సీట్లు గెలిపించండి : పొంగులేటి

ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలకు ఎలాంటి అపోహలు లేవని, గులాబీ బ్యాచ్​కు మాత్రం ఉన్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సీఎం, మంత్రులు వారి సందేహాలను తీరుస్తున్నప్పటికీ మళ్లీ మళ్లీ విమర్శలు చేస్తున్నారన్నారు. 6 గ్యారంటీలతో పాటు ప్రజలకు ఇవ్వని హామీలు కూడా అమలు చేయాలనేది మా ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యం నచ్చి అన్ని పార్టీల నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నరని, సోనియా, రాహుల్, ఖర్గే ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తమని స్పష్టం చేశారు. ఇటీవల చేవేళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి ఆమె కొడుకు పార్టీలో చేరారని, రానున్న రోజుల్లో ఇంకా ఎంతో మంది జాయిన్ అవుతారని తెలిపారు. కాం గ్రెస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పార్టీని మరింత బలోపేతం చేయాలని, వచ్చే ఎంపీ ఎన్నికల్లో 17 సీట్లు గెలపించాలని కోరారు. 

మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తం : ఉత్తమ్ 

బీఆర్ఎస్ పాలనలో మహిళా సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇ స్తామని చెప్పి ఇవ్వలేదని చేవెళ్ల సభలో మంత్రి ఉత్తమ్ మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వంలో లోన్లు ఇస్తాం. అహంకార బీఆర్ఎస్​ను బొంద పెట్టి ప్రజలు కాంగ్రెస్​కు పట్టం కట్టారు. వారి తీర్పును గౌరవిస్తూ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నం. రూ.500 కు గ్యాస్​ సిలెండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వచ్చే నెల నుంచి అమలు చేస్తం. అప్లికేషన్లు పెట్టుకోని వారు కూడా ఇప్పుడు అప్లై చేసుకుంటే స్కీమ్​లు అందజేస్తం”అని అన్నారు.

బీజేపీ, బీఆర్ఎస్ ఖబడ్దార్ : శ్రీధర్ బాబు

కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? అని బీఆర్ఎస్, బీజేపీ నేతలకు పెద్ద డౌట్ ఉండేదని చేవెళ్ల సభలో మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇప్పుడు మా స్కీమ్​ల అమలు చూసి ఆ రెండు పార్టీల నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ‘‘బండి సంజయ్ ఖబడ్దార్.. మేం తలుచుకుంటే రాష్ట్రంలో బీజేపీకి అతీగతీ ఉండదు. హుస్నాబాద్​లో మంత్రి పొన్నంపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు.  కేటీఆర్, హరీశ్ విమర్శిస్తున్నరు.. వారి నాయకుడు మాత్రం బయటకు రావట్లేదు. ఇరిగేషన్, పవర్, రాష్ట్ర అప్పులు, ఆర్థిక పరిస్థితిపై వైట్​పేపర్​ పెడితే వారి వద్ద సమాధానం ఉండదు”అని అన్నారు.

నువ్వు, నీ అయ్య వచ్చినా సీఎం కుర్చీని తాకలేరు.. 
 

లులో పెట్టినా లొంగిపోకుండా నిన్ను, నీ అయ్యను, 

అక్రమ కేసులతో జైలులో పెట్టినా లొంగిపోకుండా నిన్ను, నీ అయ్యను, నీ బావను బొందవెట్టి ఇయ్యాల కుర్చీలో కూసున్నం. ఈ కుర్చీ ఇనాం కింద వచ్చింది కాదు.. నీలాంటోళ్ల నెత్తి మీద కాలు పెట్టి తొక్కి కూసోపెట్టిన్రు మా కార్యకర్తలు. వాళ్లు నాకు అండగా నిలబడినంత కాలం నువ్వు, 
నీ అయ్య వచ్చినా ఆ కుర్చీని తాకలేరు.   

 - సీఎం రేవంత్​