ఆర్డీవో ఆదేశాలను వారసులు పట్టించుకోవట్లే

ఆర్డీవో ఆదేశాలను వారసులు పట్టించుకోవట్లే

యాదాద్రి, వెలుగు: ట్రిబ్యునల్​లో ఆర్డీవో ఇచ్చిన ఆర్డర్స్​ ను వారసులు పట్టించుకోవడం లేదని వయో వృద్ధుల కమిటీ ఆందోళన వ్యక్తం చేసింది. కలెక్టరేట్​లో నిర్వహించిన జిల్లా స్థాయి దివ్యాంగులు, వయోవృద్ధుల కమిటీ  సమావేశంలో సంక్షేమానికి తీసుకుంటున్న చర్యలపై అడిషనల్ కలెక్టర్ వీరారెడ్డి రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ మెంబర్లు మాట్లాడుతూ తమ కోసం డే కేర్ సెంటర్​తో పాటు టెంపరరీ షెల్టర్ ఏర్పాటు చేయాలన్నారు. 

ఆస్తిలో వారసులతో సమానంగా తమ వాటానువాడుకునే హక్కు కల్పించాలని కోరారు. అనంతరం అడిషనల్​ కలెక్టర్  మాట్లాడుతూ వయోవృద్ధుల హక్కుల రక్షణకు ప్రతి మూడు నెలలకోసారి  సమావేశాలు నిర్వహిస్తామన్నారు. వేధింపుల నుంచి రక్షణ కోసం చర్యలు తీసుకోవడంతో పాటు ట్రిబ్యునల్స్ ద్వారా సమస్యలు పరిష్కరిస్తామన్నారు.  సమస్యల పరిష్కారానికి టోల్ ఫ్రీ నెంబరు 1456కు కాల్​ చేయాలని సూచించారు. 

మీటింగ్​లో  శెట్టి బాలయ్య, ఎర్రగుంట వెంకటేశం, నర్సింగ రావు, సత్యనారాయణ, బాలేశ్వర్, శంకర్ రెడ్డి, సుధాకర్, బాలరాజు, దివ్యాంగుల కమిటీ  ప్రెసిడెంట్ సురపంగ -ప్రకాశ్,  నర్సింహా, జహాంగీర్, నరేశ్, ఉపేందర్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.