గర్భిణికి కరోనా.. డెలివరీ చేయమన్న సిబ్బంది

గర్భిణికి కరోనా.. డెలివరీ చేయమన్న సిబ్బంది

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట ప్రభుత్వాసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో.... ఓ గర్భిణీ హాస్పిటల్ బయట చెట్టు కింద ప్రసవించింది. గర్భిణీకి కరోనా పాజిటివ్ వచ్చిందని ప్రసవం చేయమని సిబ్బంది చెప్పారు. నాగర్ కర్నూల్ జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో ఏం చేయాలో తెలియక.. కొందరు మహిళలు గర్భిణీకి హాస్పిటల్ బయటే ప్రసవం చేశారు. తర్వాత తల్లి, బిడ్డ ఇద్దరిని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు.  

ఓ వైపు ప్రభుత్వం అన్ని ఏర్పాట్ల చేశామని చెబుతున్నా.. ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. గర్భిణీల కోసం ప్రత్యేక వార్డులు కూడా ఏర్పాటు చేశామని ప్రభుత్వం చెబుతూనే ఉంది. నిన్నటికి నిన్న మంత్రి హరీష్ రావు గర్భిణీలకు కరోనా వచ్చినా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని.. ఆస్పత్రుల్లో అన్ని వసతులు ఉన్నాయని చెప్పారు. గతేడాది హైకోర్టు కరోనా ఉన్నా ఎమర్జెన్సీ కేసులకు ట్రీట్ మెంట్ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మధ్యే రెండు, మూడు జిల్లాల్లో కరోనా ఉన్న గర్భిణీలకు స్పెషల్ వార్డులో డెలివరీ చేశారు డాక్టర్లు. అచ్చంపేట వైద్య సిబ్బంది మానవత్వం మరిచారన్న విమర్శలు వస్తున్నాయి

ఇవి కూడా చదవండి: 

వచ్చే ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి పోటీ చేస్తా

హరీశ్ రావు కాన్వాయ్ అడ్డుకున్నబీజేపీ నేతలు