స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన కస్టమర్లకు పండుగ ఆఫర్లు ప్రకటించింది. దీపావళి సందర్భంగా క్రెడిట్ కార్డు వినియోగదారులకు గంటగంటకూ నగదు బహుమతితోపాటు అత్యధిక మొత్తం ఖర్చు చేసిన కస్టమర్ కి లక్ష రూపాయల విలువైన ‘మేక్ మై ట్రిప్’ హాలిడే ఓచర్ ను గెల్చుకునే అవకాశం కల్పిస్తోంది.
అంతేకాదు వీటితోపాటు రోజు వారీ గిఫ్ట్లలో రూ.7వేల రూపాయల విలువైన ఇయర్ఫోన్స్, వీకెండ్ గిఫ్ట్ల్లో రూ.17,500 విలువైన షియోమి స్మార్ట్ ఫోన్లు గెల్చుకునే అవకాశం కల్పిస్తోంది. అక్టోబరు 30వ తేదీ వరకు ఈ ఆఫర్ అమల్లో ఉండనుంది. SBI దీని కోసం రకాల పెద్ద బ్రాండ్ల కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇటీవల ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ గ్రేట్ ఇండియా సేల్లో భాగంగా 10 శాతం డిస్కౌంట్ ఆఫర్ చేసింది.