18 నుంచి ప్రారంభం కానున్న దేశీయ విమాన సర్వీసులు

18 నుంచి ప్రారంభం కానున్న దేశీయ విమాన సర్వీసులు

ఈ నెల 17‌తో లాక్‌డౌన్‌ గడువు ముగియనున్న క్రమంలో ఆ తర్వాతి రోజు(మే-18) నుంచి దేశీయ విమాన సర్వీసులు నడపాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు సడలింపులు ఇచ్చిన కేంద్రం విమాన సేవలు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్టు సమాచారం. విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలపై నిన్న(సోమవారం) డీజీసీఏ, సీఐఎస్ఎఫ్, విమానాశ్రయాల ప్రాధికార సంస్థ అధికారులు, డీఐఏఎల్ అధికారులతో కూడిన కమిటీ ఢిల్లీ విమానాశ్రయంలో తనిఖీలు నిర్వహించింది. సర్వీసులు ప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించింది. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ విమానాశ్రయాల నుంచి దేశీయ సర్వీసులను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.