మరోసారి పోలీస్ కస్టడీకి టోని?

 మరోసారి పోలీస్ కస్టడీకి టోని?

డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన స్మగ్లర్ టోనీ ఐదు రోజుల పోలీస్ కస్టడీ ముగిసింది. నాంపల్లి కోర్టులో టోనిని హాజరు పరిచారు పోలీసులు. ఐదు రోజుల కస్టడీలో పోలీసులు టోనీ నుంచి కీలక విషయాలు రాబట్టారు. పంజాగుట్ట పోలీసుల అదుపులో టోనీ ఏజెంట్లు నలుగురు , సాక్షులు ఇద్దరు ఉన్నారు. టోనీ డ్రగ్స్ సప్లై చేసినట్లు ఇద్దరి వద్ద పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. డ్రగ్స్ మాఫియా డాన్ స్టార్ బాయ్  వ్యవహారంలో కూడా కీలక సమాచారం రాబట్టారు పోలీసులు. గత ఆరు నెలలుగా టోనీ అకౌంట్ లో లక్షలు రూపాయలు విత్ డ్రా లు చేసినట్లు గుర్తించారు. ఏడుగురు వ్యాపార వేత్తలతో సంబంధాలు, ఒయో రూమ్స్ కేంద్రంగా డ్రగ్స్ దందా చేసినట్లు టోనీ అంగీకరించాడు. పరారీ లో ఉన్న ముగ్గురు వ్యాపార వేత్తలు కోసం ప్రస్తుతం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్ కి పాల్పడినట్లు గుర్తించారు. డ్రగ్స్ ద్వారా వచ్చిన నగదును హవాలా రూపంలో విదేశాలకు తరలించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. ఈ క్రమంలో పోలీసులు మరోసారి టోనీని కస్టడీకి కోరనున్నట్లు సమాచారం. 

ఇవి కూడా చదవండి:

వైజాగ్ ఏజెన్సీ నుంచి సిటీకి హాష్ ఆయిల్

ఎపిసోడ్​కు మూడు లక్షల పారితోషికం