
హైదరాబాద్, వెలుగు: రెఫరల్ ఆర్గనైజేషన్ బిజినెస్ నెట్వర్క్ ఇంటర్నేషనల్ (బీఎన్ఐ) గోనాట్ పేరుతో సెప్టెంబర్ 9, 10 వ తేదీలలో హైదరాబాద్లో ఎంఎస్ఎంఈలు, బిజినెస్ ఆర్గనైజేషన్ల కోసం సదస్సు నిర్వహిస్తున్నది. తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ శుక్రవారం గోనాట్ 2023 లోగోను లాంచ్ చేశారు. కార్యక్రమంలో బీఎన్ఐ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సంజనా షా, బీఎన్ఐ హైదరాబాద్ ఏరియా డైరెక్టర్ సతీష్ కుమార్ పాల్గొన్నారు. చిన్న, మధ్యతరహా వ్యాపారాలు బలపడటానికి, జాతీయ స్థాయిలో ఎదగడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని సంజన చెప్పారు. ఈ రెండు రోజుల సదస్సులో సెమినార్తోపాటు ఎక్స్పో ఉంటుందని అన్నారు. ఈసారి ఈవెంట్కు దేశ విదేశాలకు చెందిన ఎంటర్ప్రెన్యూర్లు వస్తున్నారని ఆమె వివరించారు.