ఎన్‌బీఆర్‌‌ ఫౌండేషన్‌తో యువతకు భరోసా : గుత్తా సుఖేందర్ రెడ్డి

ఎన్‌బీఆర్‌‌ ఫౌండేషన్‌తో యువతకు భరోసా : గుత్తా సుఖేందర్ రెడ్డి

మిర్యాలగూడ, వెలుగు : ఎన్‌బీఆర్ ఫౌండేషన్ చైర్మన్‌ నల్లమోతు సిద్ధార్థ ​పోటీ పరీక్షలకు కోచింగ్‌లు, జాబ్​ మేళాలు ఏర్పాటు చేసి యువతకు భరోసా ఇస్తున్నారని శాసన మండలి ఛైర్మన్​ గుత్తా సుఖేందర్ రెడ్డి అభినందించారు.  బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని టీఎన్​ఆర్ గార్డెన్‌లో టాస్క్,​ ఎన్​బీఆర్ ఫౌండేషన్​ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్​ మేళాను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... జాబ్‌మేళాలను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.  

అనంతరం కాల్వాపల్లి గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో  రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, డీసీఎంఎస్​జిల్లా వైస్​ చైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అద్యక్షుడు చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎంపీపీ సరళా హనుమంత రెడ్డి,  పాల్గొన్నారు.