
సంగారెడ్డి జిల్లాలో మహిళా సంఘాలకు 75 కోట్ల నిధులు విడుదల చేస్తున్నామన్నారు మంత్రి హరీష్ రావు. SC కార్పోరేషన్ ద్వారా లబ్దిదారులకు రుణాలను పంపిణీ చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్నవారికి 50 వేల నుంచి లక్ష రూపాయలు ఇస్తున్నామన్నారు హరీష్. జిల్లాలో 20 కోట్లతో మైనార్టీ స్కూల్ కు శంకుస్థాపన చేస్తున్నామన్నారు.
లబ్ధిదారులకు బ్యాంక్ లతో నిమిత్తం లేకుండా….ప్రభుత్వం లక్ష రూపాయల రుణం నేరుగా ఇస్తుందన్నారు. 80 శాతం సబ్సీడీతో రుణాలు ఇస్తున్నామన్నారు హరీశ్. ఈ కార్యక్రమంలో హరీశ్ తో పాటు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.
More News