రైతుల నిరసనల దృష్ట్యా హర్యానాలోని ఏడు జిల్లాల పరిధిలో మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రైతులు కనీస మద్దతు ధరతో సహా తమ డిమాండ్ల కోసం ఒత్తిడి చేసేందుకు 'ఢిల్లీ చలో' మార్చ్ను ప్లాన్ చేశారు. ఈ క్రమంలో.. అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిస్సార్, ఫతేబాద్, సిస్రా జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేయబడ్డాయి. వాయిస్ కాల్స్ మినహా ఇంటర్నెట్, ఎస్ఎంఎస్ సేవలు నిలిపివేయబడ్డాయి.
ఫిబ్రవరి 11 ఉదయం 6 గంటల నుండి ఫిబ్రవరి 13 రాత్రి 11:59 వరకు ఈ నిలిపివేతలు అమలులో ఉండనున్నాయి. యుక్త కిసాన్ మోర్చా, కిసాన్ మజ్దూర్ మోర్చా సహా 200కు పైగా రైతు సంఘాలు ఫిబ్రవరి 13న (మంగళవారం) 'ఢిల్లీ చలో' మార్చ్ను నిర్వహించనున్నట్లు ప్రకటించాయి .
రైతుల పాదయాత్రను దృష్టిలో ఉంచుకుని అంబాలాలో హర్యానా పోలీసులు బారికేడింగ్లు ఏర్పాటు చేశారు. ఛలో ఢిల్లీ ఆందోళనలో మూడు లక్షల మంది వరకు రైతులు పాల్గొనే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తమౌతున్నాయి.