నకిరేకల్ లో వీరేశం ఎంట్రీతో జానా అనుచరుడి నారాజ్

నకిరేకల్ లో వీరేశం ఎంట్రీతో  జానా అనుచరుడి నారాజ్
  • కొండేటి మల్లయ్య టికెట్ ​ఆశలు గల్లంతు
  • గత మూడు టర్మ్​ల నుంచి సేమ్​ సీన్​ రిపీట్

నల్గొండ, వెలుగు:  నకిరేకల్​ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కాంగ్రెస్​లో చేరడంతో ఆ పార్టీ సీనియర్​నేత జానారెడ్డి ప్రధాన అనుచరుడు కొండేటి మల్లయ్యకు గట్టిషాక్​ తగిలింది. గత మూడు టర్మ్​ల నుంచి నకిరేకల్​సీటు కోసం ఫైట్​చేస్తున్న మల్లయ్య ఈసారి ఎట్టి పరిస్థితుల్లో తనకు టికెట్​వస్తదని ఆశతో ఉన్నారు. ఇటు జానారెడ్డి, అటు పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి ఆశీస్సులు ఉండటంతో మల్లయ్యకు ఈ దఫా తిరుగు ఉండదనే భావించారు. ఆ మేరకు పార్టీ సభ్యత్వ నమోదుతో సహా, పార్టీ హైకమాండ్​పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమాన్ని ఆయన సక్సెస్​చేశారు. 

రేవంత్​అండతోనే మల్లయ్య పీసీసీ కమిటీలో చోటు కూడా దక్కింది. కానీ వీరేశం పార్టీలో చేరేందుకు లైన్​క్లియర్​అయిందని ప్రచారం జరుగుతున్నప్పటి నుంచి మల్లయ్య తన టికెట్​ కోసం గట్టిగానే ప్రయత్నించారు. దామోదర రాజనర్సింహా, జానా రెడ్డితో సహా ఏఐసీసీ స్థాయిలో తనకున్న పరిచయాలతో టికెట్​వస్తదనే అనుకున్నారు. అయితే వీరేశం రాకను మొదట్లో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం వ్యతిరేకించారు. కానీ అధిష్టానం ఆదేశాలతో కోమటిరెడ్డి సైతం దిగరాక తప్పలేదు. మల్లయ్యను ప్రోత్సహించిన రేవంత్​స్వయంగా వీరేశాన్ని వెంటపెట్టుకుని పార్టీ హైకమాండ్​ వరకు తీసుకెళ్లారు. 

ఈ పరిణామాలతో షాక్​ తిన్న మల్లయ్య అయోమయంలో పడ్డారు. ఇప్పటికే టికెట్​వస్తదన్న నమ్మకంతో నకిరేకల్​లో భారీగా ఖర్చు పెట్టారు. ఈయనతోపాటు మాజీ ఎమ్మెల్యే వేదాసు వెంకయ్య కొడుకు శ్రీధర్, ప్రసన్నరాజ్, దైదా రవీందర్​లు కూడా రేసులో ఉన్నారు. వీరంతా కోమటి రెడ్డి మీద నమ్మకం పెట్టుకున్నారు. కానీ చివరకు పార్టీ ఆదేశాల మేరకు సీనియర్లు, ఆశావహులు తలొంచాల్సి వచ్చింది. ఇప్పటికైతే కోమటిరెడ్డి వర్గం సైలెంట్​గా ఉన్నప్పటికీ, మల్లయ్య మాత్రం త్వరలో తన భవిష్యత్తు  రాజకీయ కార్యచరణ ప్రకటించే ఆలోచనకు వచ్చినట్టు తెలిసింది. శుక్ర వారం ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నకిరేకల్​కు ఆహ్వానించి ఎన్నికల ప్రచారానికి వీరేశం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ఆశావహులు ఎవరూ రాకపోవడం గమనార్హం.