ODI World Cup 2023: ముంబై మ్యాచ్ కు అతిరథ మహారథులు : రజినీకాంత్ ఎందుకొస్తున్నట్లు..!

ODI World Cup 2023: ముంబై మ్యాచ్ కు అతిరథ మహారథులు : రజినీకాంత్ ఎందుకొస్తున్నట్లు..!

వరల్డ్ కప్ లో ఇండియా , శ్రీలంక కీలక మ్యాచ్ కు అంతా సిద్ధం.. ముంబై వేదికగా వాంఖడే స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ చూసేందుకు అతిరథ మహారథులు తరలివస్తున్నారు. సినిమా హీరోలు చాలా మంది హాజరవుతున్నారు. ఒకే ఒక్క హీరో విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయ్యింది. ఆయనే సూపర్ స్టార్ రజినీకాంత్.. ముంబై వెళ్లి మరీ.. ఇండియా, శ్రీలంక మ్యాచ్ చూస్తున్నారు.. ఇప్పటికే చెన్నై వేదికగా చాలా మ్యాచులు జరిగాయి.. వాటికి మాత్రం హాజరుకాలేదు రజినీకాంత్.. అలాంటి ఆయన.. ముంబై వచ్చి మరీ మ్యాచ్ ను స్వయంగా చూడాలని నిర్ణయించుకోవటం హాట్ టాపిక్ అయ్యింది. 

Also Read : యంగ్ షూటర్ తోమర్‌‌‌‌‌‌‌‌కు గోల్డ్ మెడల్

మొన్నటికి మొన్న ఉత్తరప్రదేశ్ వెళ్లి.. సీఎం యోగీ కాళ్లు మొక్కారు.. ఇప్పుడు బీసీసీఐ సెక్రటరీ జై షా.. చెన్నై వెళ్లి స్వయంగా రజినీకాంత్ ను ఆహ్వానించారు. దీనికి ఆయన ఓకే చెప్పటంతో.. ప్రత్యేక విమానంలో చెన్నై నుంచి ముంబై వచ్చారు. బీజేపీతో రజినీకాంత్ సంబంధాలు బాగున్నాయనే సంకేతాలను జనంలోకి పంపిస్తున్నారా అనే ప్రశ్నలపై చర్చ నడుస్తుంది. MCA ప్రెసిడెంట్ అమోల్ ఖేల్ నుంచి కూడా రజినీకాంత్ కు పిలుపు వచ్చింది. ఇక ఈ  మ్యాచ్ కు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్, షాహిద్ కపూర్, బాలీవుడ్ బడా హీరోలు సైఫ్ అలీ ఖాన్ హాజరవుతున్నారు.   

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే భారత్ ఈ మ్యాచ్ లో శ్రీలంకపై విజయం సాధిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా సెమీ ఫైనల్ కు చేరుకుంటుంది. మరో వైపు శ్రీలంక ఓడితే ఈ టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమిస్తుంది. టీమిండియా ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచ్ ల్లో విజయం సాధించగా.. శ్రీలంక మాత్రం ఆడిన ఆరు మ్యాచుల్లో రెండు విజయాలు మాత్రమే సాధించింది. 2011 లో శ్రీలంకపై ఇక్కడే భారత్ వరల్డ్ కప్ ఫైనల్ నెగ్గిన సంగతి తెలిసిందే. మొత్తానికి అతిరధ మహారధులతో గ్రాండ్ గా జరగనున్న ఈ  మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.