కాంగ్రెస్ ను నమ్మితే కరువు తప్పదు : కొప్పుల మహేశ్​ రెడ్డి

 కాంగ్రెస్ ను నమ్మితే కరువు తప్పదు : కొప్పుల మహేశ్​ రెడ్డి

గండీడ్, వెలుగు: కాంగ్రెస్ ను నమ్మి ఓటేస్తే జిల్లాలో కరువు తప్పదని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​ రెడ్డి అన్నారు. మహమ్మదాబాద్ మండలంలోని దేశాయపల్లి గేట్ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం బుధవారం ఏర్పాటు చేశారు. కార్యకర్తలు బైక్ ర్యాలీతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు. సభలో ఎమ్మెల్యే మాట్లాడారు.

గతంలో ఎన్నడూ లేని పథకాలు బీఆర్​ఎస్​ హాయంలో అందాయన్నారు. అలాగే ఉమ్మడి గండీడ్ మండలం నుంచి 800 మంది కాంగ్రెస్ , బీజేపీ నాయకులు బీఆర్​ఎస్​ లో చేరారు. కార్యక్రమంలో బీఆర్​ఎస్​ రాష్ట్ర నాయకులు అనిల్ రెడ్డి, జడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఈశ్వరయ్య గౌడ్, పీఏసీఎస్​ వైస్ చైర్మన్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.