లక్నో: హనుమాన్ శోభాయాత్రలో ముస్లింలు పాల్గొని మత సామరస్యాన్ని చాటుకున్నారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. హనుమంతుడి శోభాయాత్రలో ముస్లిం యువకులు పూలవర్షం కురిపించారు. జై హనుమాన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో హనుమాన్ భక్తులు ముస్లిం యువకులను అభినందించారు. మరోవైపు మతఘర్షణలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసి.. శోభాయాత్ర ప్రశాంతంగా ముగిసేలా చేశారు.
ఇవి కూడా చదవండి
కలెక్టర్ నివాసంలోకి చొరబడ్డ చిరుతపులి
సారవంతమైన సాగుభూములను లాక్కుంటే అడ్డుకుంటాం