తొలిసారి రక్తదానం చేసిన అకీరానందన్

తొలిసారి రక్తదానం చేసిన అకీరానందన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పెద్ద కొడుకు అకీరానందన్ హాట్ టాపిక్ అయ్యాడు. రక్తదానం చేసి యూత్ కు ఇన్ స్పైర్ గా నిలిచాడు. అకీరా నందన్  సినిమాల్లోకి రాబోతున్నాడని ఎప్పటికప్పుడు ఊహాగానాల జోరు పెరిగిన ప్రతిసారి లేదు.. రావడం లేదంటూ తల్లి రేణుదేశాయ్ ఖండించడం తరచూ జరిగేదే. అయితే అకీరానందన్ గురించి ఈసారి రేణు దేశాయ్ చేసిన ఈ కొత్త అప్డేట్ చర్చనీయాంశం అయింది. 
మొన్న అంటే ఈనెల 8న అకీరానందన్ 18వ వసంతంలోకి అడుగుపెట్టడంతో కొత్త అప్డేట్ కోసం ఎదురు చూస్తున్న తరుణంలో అభిమానులు ఊహించని రీతిలో అప్డేట్ ఇచ్చారు రేణు దేశాయ్. ఇవాళ తన కుమారుడు అకీరా నందన్ రక్తదానం చేశాడంటూ ఫోటోను షేర్ చేశారు. ‘18 ఏళ్లు నిండిన తర్వాత అకీరా చేసిన మొదటి రక్తదానం! అవసరంలో ఉన్నవారికి మనం ఇచ్చే అత్యంత విలువైన వస్తువు మన రక్తం. దయచేసి మీకు 18 ఏళ్లు నిండిన తర్వాత మీకు వీలైనంత వరకు రక్తదానం చేయండి. మీరు ఎవరి ప్రాణాలను కాపాడగలరో మీకు ఎప్పటికీ తెలియదు..’’ అంటూ రేణు దేశాయ్ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేశారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by renu (@renuudesai)

 

 

ఇవి కూడా చదవండి

పీకే రాకను స్వాగతిస్తాం

నిధుల్లో కేంద్ర, రాష్ట్ర వాటాలపై చర్చకు సిద్ధం

ఒక్క నిమిషం లేటైతే అనుమతించరు.. మరీ మీరు కావొచ్చా..?