తేజ్ ను కాపాడిన అబ్దుల్ ఫరాన్ ను.. నా గుండెల్లో పెట్టుకుంటా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

తేజ్ ను కాపాడిన అబ్దుల్ ఫరాన్ ను.. నా గుండెల్లో పెట్టుకుంటా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan), సుప్రీం హీరో సాయి ధరమ్(Sai Dharam) కాంబో లో వస్తోన్న మూవీ 'BRO'. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జూలై 25న హైదరాబాద్ శిల్పకళా వేదికలో జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్.. సాయి ధరమ్ తేజ్ గురుంచి మాట్లాడుతూ 'తేజ్ రియల్ లైఫ్ లో జరిగిన ఆక్సిడెంట్ కు.. ఈ మూవీలో తేజ్ క్యారక్టర్ కు చాలా దగ్గర పోలికలు ఉంటాయి. 

ఆ టైం లో అబ్దుల్ సైద్ ఫరాన్(Abdul Said Faran) అనే వ్యక్తి వెంటనే రక్షించకపొతే  తేజ్ లేరు. ఈరోజు తేజ్ మన మధ్యన ఉన్న..ఈ సినిమా చేస్తున్న దానికి కారణం ఫరాన్ వెంటనే స్పందించడమే. అందుకు అబ్దుల్ సైద్ ఫరాన్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు పవన్. 

ALSO READ :మోదీ సర్కార్ పై అవిశ్వాస తీర్మానం : లోక్ సభలో పార్టీల బలాబలాలు

ఇటువంటి సమాజం రావాలి. ఏం జరిగిన వెంటనే రియాక్ట్ కాగలిగే మనస్త్వత్వం అందరిలో ఉండాలని పవన్ కోరుకున్నారు. అలాగే.. 'తేజ్ ఆక్సిడెంట్ జరిగిన టైం లో.. నేను నమ్మిన జగన్మాత ను ఒక్కటే కోరుకున్న.. ఇంకా జీవించాల్సిన తేజ్ ను రక్షించు..ఒక మూగరోదనలా కూర్చుని ఆ దైవాన్ని ప్రార్ధించడం తప్ప ఏం చేయలేదు. తేజ్ ను ఫస్ట్ కేర్ చేసిన మెడికోర్ హాస్పిటల్, అపోలో హాస్పిటల్ వైద్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని పవన్ తెలిపారు.