ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో అడ్డంకులను అధిగమించాం: మోడీ

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో అడ్డంకులను అధిగమించాం: మోడీ

ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి శకం నడుస్తోందని ప్రధాని మోడీ తెలిపారు. ఏడు దశాబ్ధాల్లో గత ప్రభుత్వాలు ఈశాన్య రాష్ట్రాలకు రూ.2 లక్షల కోట్లు ఖర్చు పెడితే.. ఈ ఏడాది తాము రూ.7 లక్షల కోట్లు ఖర్చు చేయబోతున్నట్లు ఆయన వెల్లడించారు. అవినీతి, హింస, ఓటు బ్యాంకు రాజకీయాలు లేకుండా చేసేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామన్నారు.

ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధిలో అడ్డంకులను అధిగమించామని మోడీ చెప్పారు. మేఘాలయ షిల్లాంగ్ లో జరిగిన నార్త్ ఈస్టర్న్ కౌన్సిల్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో ప్రధాని నరేంద్రమోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొన్నారు.