నిర్భయ దోషులకు అన్ని దారులు మూసుకుపోయాయి. వారికి ఉరిశిక్ష అమలు ఖాయమైనట్టు తెలుస్తోంది. ఆఖరి ప్రయత్నంగా దోషుల్లో ఒకరైన ముఖేష్ కుమార్ సింగ్ వేసిన క్షమాభిక్ష పిటిషన్ను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ తిరస్కరించారు.
ఈ పిటిషన్ ను రెండు రోజుల క్రిందట కేంద్ర హోంశాఖ రాష్ట్రపతికి పంపించింది. దీంతోపాటే, నిర్భయ దోషులు అత్యంత దారుణానికి పాల్పడ్డారని, వీరికి క్షమాభిక్ష పెట్టవద్దని రాష్ట్రపతిని కోరింది. ఈ నేపథ్యంలో, పిటిషన్ ను పరిశీలించిన రాష్ట్రపతి ఎక్కువ సమయం కూడా తీసుకోకుండానే పిటిషన్ ను తిరస్కరించారు.దీనితో వారిని ఉరి వేయడానికి లైన్ క్లియర్ అయింది.
అయితే ముఖేష్ క్షమాభిక్ష పిటిషన్ రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్నందున ఈ నెల 22న సాధ్యం కాదని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణకు గురైన తర్వాత ఉరి తీయడానికి మధ్య 14 రోజులు గడువు ఉంటుంది. దాని ప్రకారం ఉరిశిక్ష మరో 14 రోజులు ఆలస్యం కానుంది.