దక్షిణ కొరియా స్మార్ట్ఫోన్ మేకర్ శామ్సంగ్ ఇండియా మార్కెట్లోకి గెలాక్సీ ఏ20ఎస్ పేరుతో మరో బడ్జెట్ ఫోన్ను తీసుకొచ్చింది. ఇది గెలాక్సీ ఏ 20కి అప్గ్రేడెడ్ వెర్షన్. ఫాస్ట్ చార్జింగ్, ట్రిపుల్ రియర్ కెమెరాలు ఇందులోని ప్రత్యేకతలు. 3జీబీ ధర రూ.11,999లు కాగా, 4జీబీ ధర రూ.13,999. ఇందులో 6.5 ఇంచుల డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 450 ప్రాసెసర్, 8 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్నాయి.