- ప్రపంచంలోనే తొలి కేసు కెనడాలో నమోదు
న్యూఢిల్లీ: వాతావరణ మార్పులతో అనారోగ్యం బారినపడ్డ తొలికేసు కెనడాలో నమోదైంది. ఇప్పటికే చాలా వ్యాధులతో సతమతమవుతున్న ఓ 70 ఏండ్ల మహిళలో క్లైమేట్ చేంజ్వల్ల ఆ హెల్త్ ప్రాబ్లమ్స్ మరింత తీవ్రమైనట్టు డాక్టర్లు గుర్తించారు. ఈ ఏడాదిలో వరుసగా విజృంభించిన హీట్వేవ్స్వల్ల పేషెంట్ఆరోగ్యం క్షీణించిందని ఆమెకు ట్రీట్మెంట్చేసిన బ్రిటిష్ కొలంబియాలోని హాస్పిటల్ డాక్టర్లు చెప్పారు. కెనడా, అమెరికాల్లోని కొన్ని ప్రాంతాల్లో హీట్వేవ్స్ పెరగడంతో ఈ ఏడాది వందలాది మంది చనిపోయారు. కెనడాలోని ఒక్క బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లోనే 233 మంది మరణించారు. చాలామందికి డయాబెటిస్, గుండెపోటు, ఉబ్బసం వంటి సమస్యలు తలెత్తాయి.
హాస్పిటళ్లకు పేషెంట్ల తాకిడి పెరగడంతో..
కెనడా, అమెరికాల్లో ఈ ఏడాది వేడి గాలులు విపరీతంగా పెరిగాయి. దీంతో ప్రావిన్స్లోని హాస్పిటల్స్కు పేషెంట్ల తాకిడి ఎక్కువైంది. ఎక్కువ మంది ఎండ దెబ్బతో, ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్తో ఆస్పత్రులకు క్యూ కట్టారు. ఇలా ఒకేసారి హాస్పిటళ్లపై ఒత్తిడి పెరగడంతో ఏమయ్యుంటుందోనని డాక్టర్లు ఆరా తీశారు. హీట్వేవ్స్ వల్లే ఇలాంటి ఇబ్బందులు పెరగలేదని, ఈ మధ్య వరుసగా అడవుల్లో కార్చిచ్చులు చెలరేగి చాలా మందికి ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోందని గుర్తించారు. కార్చిచ్చుల వల్ల పార్టిక్యులేట్ మ్యాటర్(పీఎం) 2.5 స్థాయి వాతావరణంలో పెరగడంతో ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఎక్కువయ్యాయని కనుగొన్నారు. రోగ లక్షణాలతో పాటు వాటికి కారణాలను గుర్తించి చెప్పినప్పుడే పనికి న్యాయం చేసినవాళ్లమవుతామని డాక్టర్లు చెప్పారు. ప్రావిన్స్ లో డాక్టర్లు, నర్సులు, హెల్త్కేర్ప్రొఫెషనల్స్ 40 మంది కలిసి ఓ గ్రూప్గా ఏర్పడ్డారు. వాతావరణ మార్పుల వల్ల కలిగే దారుణాల గురించి ప్రజలకు వివరించడం స్టార్ట్ చేశారు.