ఏసీసీలో సింప్లిజిత్కు మెజారిటీ వాటా

ఏసీసీలో సింప్లిజిత్కు మెజారిటీ వాటా

హైదరాబాద్​, వెలుగు:  హైదరాబాద్​ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ సంస్థ సింప్లిజిత్​ గ్రూప్​, అరేబియన్​ కన్​స్ట్రక్షన్​ కంపెనీ (ఏసీసీ) ఇండియాలో మెజారిటీ వాటాను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిద్వారా సింప్లిజిత్​ భారీస్థాయి మౌలిక సదుపాయాలు, రియల్​ ఎస్టేట్, ఉత్పత్తుల ట్రేడింగ్​, బ్రాండింగ్,  కమ్యూనికేషన్స్ రంగాల్లోకి ప్రవేశిస్తుంది. 

ప్రీమియం రెసిడెన్షియల్​, వాణిజ్య మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై దృష్టి సారిస్తుంది. ఏసీసీ నిర్మాణ అనుభవం, సింప్లిజిత్​ ఆర్థిక పటిమ, అంతర్జాతీయ భాగస్వామ్యాల నెట్​వర్క్​ వల్ల మేలు జరుగుతుందని ఈ​ గ్రూప్​ ఎండీ అభిజిత్​ జయంతి అన్నారు. ఏసీసీ ఆర్డర్​ పైప్​లైన్​ రూ. 2,500 కోట్లు దాటిందన్నారు.