చైనా లోన్ యాప్లపై  రాజ్యసభలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

చైనా లోన్ యాప్లపై  రాజ్యసభలో నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

ఢిల్లీ : సులువుగా రుణాలు అందించి.. ఆ తర్వాత ప్రజలను మోసం చేస్తున్న చైనా మొబైల్ యాప్ లపై కఠినంగా వ్యవహరిస్తామని కేంద్ర ఆర్ధికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రభుత్వ శాఖలు, రిజర్వ్ బ్యాంకు సమన్వయంతో చర్యలు తీసుకుంటామని రాజ్యసభలో తెలిపారు.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ లేవనెత్తిన జీరో అవర్ అంశంపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడారు. చైనా లోన్ యాప్ లు ప్రజలను వేధిస్తూ..మోసం చేస్తున్నట్లు కేంద్రం దృష్టికి వచ్చిందని తెలిపారు. దీనిపై సెంట్రల్ బ్యాంక్ ప్రతినిధులు..ఫైనాన్స్ అధికారులు పలుసార్లు సమావేశాలు నిర్వహించి సమీక్షించారని సభకు వివరణ ఇచ్చారు. ప్రజలను మోసం చేసే వారిని, సంస్థలను ఎవరినీ ఉపేక్షించబోమని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.