కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

కేంద్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ఆర్మూర్, వెలుగు: పేదల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న స్కీమ్​లను ప్రతీ ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ ఆర్మూర్ ​మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జీవీ నర్సింహారెడ్డి, మాజీ మున్సిపల్​ చైర్మన్ కంచెట్టి గంగాధర్ పేర్కొన్నారు. సోమవారం ఆర్మూర్ టౌన్ లోని పాత బస్టాండ్ సమీపంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రపై అవగాహన సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్​ ఉదయ్, పాలెపు రాజు, నూతుల శ్రీనివాస్ రెడ్డి, పులి యుగంధర్, పీర్​సింగ్, మహిళా మోర్చా ప్రతినిధులు స్వభావికా గౌడ్, పద్మ, సునీత, నిఖిత, ఐకేపీ టీఎంసీ ఉదయశ్రీ, ఎస్​బీఐ మేనేజర్ హర్ష పాల్గొన్నారు.