కరోనా కేసులు పెరిగిపోతుండంతో తమిళనాడు సర్కారు అలర్ట్ అయింది. రాష్ట్రవ్యాప్తంగా ఎల్లుండి ఆదివారం రోజు లాక్ డౌన్ విధిస్తున్నట్టు సీఎం స్టాలిన్ ప్రకటించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు తమిళనాడు వైద్య శాఖ అధికారులు.
Tamil Nadu Chief Minister MK Stalin announces that there will be a complete lockdown all over the State on January 23rd (Sunday).#COVID19 pic.twitter.com/1P27rj1DGi
— ANI (@ANI) January 21, 2022
తమిళనాడులో కరోనా విజృంభిస్తోంది . నిన్న ఒక్క రోజే 28 వేల 561 కేసులు రికార్డయ్యాయి. 39 మంది చనిపోయారు. చెన్నైలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. గురువారం ఒక్కరోజే 7 వేల 520 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది.