తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల చేశారు విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేషం. ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలు విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో60.01 శాతం మంది పాస్ అయ్యారని తెలిపారు. సెకండ్ ఇయర్ లో 64.16 శాతం మంది పాస్ అయ్యారని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఇయర్ లో రంగారెడ్డి జిల్లా ఫస్ట్ ప్లేస్ లో నిలిచిందని తెలిపారు.సెకండ్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ లో ములుగు జిల్లా టాప్ ప్లేస్ లో నిలిచింది.
- ఫస్ట్ ఇయర్ ఎంపీసీ మొత్తం పరీక్ష రాసిన వారి సంఖ్య 2 లక్షల 19 వేల 782 .... పాస్ అయినవారి సంఖ్య1లక్షా 50 వేల 597. 68 శాతం మంది పాస్ అయ్యారు.
- సెకండ్ ఇయర్ ఎంపీసీ మొత్తం పరీక్ష రాసిన వారి సంఖ్య 2 లక్షల 17 వేల 839... పాస్ అయినవారి సంఖ్య 1లక్షా 60 వేలు. 73.8 శాతం మంది పాస్ అయ్యారు.
- ఫస్ట్ ఇయర్ బైపీసీ మొత్తం పరీక్ష రాసిన వారి సంఖ్య 93 వేల 363... పాస్ అయినవారి సంఖ్య 62 వేల 875. 67.34 శాతం మంది పాస్ అయ్యారు.
- సెకండ్ ఇయర్ బైపీసీ మొత్తం పరీక్ష రాసిన వారి సంఖ్య 1 లక్షా14 వేల 180.....పాస్ అయినవారి సంఖ్య 70 వేల 338... 37.52 శాతం మంది పాస్ అయ్యారు.