మహబూబాబాద్: ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని గుంజేడు ముసలమ్మ తల్లి జాతరలో సీతక్క పాల్గొన్నారు. మూడు రోజుల పాటు జరిగిన ఈ జాతరను ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు. ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. జాతరలో పాల్గొన్న సీతక్క ఆదివాసీ నృత్యం చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ... మేడారం సమక్క సారలమ్మ జాతర లాగే గుంజేడు ముసలమ్మ తల్లికీ ప్రాముఖ్యత ఉందన్నారు. ఆదివాసీ ప్రతి పండగ వెనుక ఒక మంచి కారణముంటుందన్నారు. ఆదివాసీ సంస్కృతిపై దాడికి పాల్పడితే ఊరుకునేదిలేదని హెచ్చరించారు.
మరిన్ని వార్తల కోసం: