కీసర కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన శ్వేత భర్త కుటుంబ సభ్యులు

కీసర కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన శ్వేత భర్త కుటుంబ సభ్యులు

కీసర కిడ్నాప్​ కేసులో ట్విస్ట్​.. కిడ్నాప్​కు గురైన శ్వేత అత్తింటి కుటుంబ సభ్యులు పోలీస్​ స్టేషన్​ఎదుట ఆందోళనకు దిగారు. గురువారం (సెప్టెంబర్​25)న్యాయం చేయాలంటూ ఆమె భర్త, అత్తమామ, కుటుంబ సభ్యులు పోలీసులను డిమాండ్​ చేశారు. మరోవైపు శ్వేతను కిడ్నాప్ విషయంలో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్వేత ఆచూకీ ఇంకా తెలియలేదు.. రెండు టీంలుగా విడిపోయి శ్వేతకోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. 

కీసర పోలీస్​ స్టేషన్​ పరిధిలోని నర్సంపల్లిలో బుధవారం ప్రేమించు పెళ్లి చేసుకున్న శ్వేతను కన్నవాళ్లే కిడ్నాప్​ చేశారు. అత్తింట్లో ఉండగా ఇంట్లో చొరబడిన ఆరుగురు వ్యక్తులు ఆమెను బలవంతంగా లాక్కెళ్లారు. అడ్డుకున్న అత్తింటివారిని చితకబాదారు. దీంతో శ్వేత భర్త ప్రవీణ్, మామ, అత్త కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. 

►ALSO READ | రూ. 18 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్..

గురువారం వరకు శ్వేత ఆచూకీ తెలియకపోవడంతో  భర్త ప్రవీణ్​, అతని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కీసర్​ పోలీస్​ స్టేషన్​ ఎదుట ఆందోళనకు దిగారు. శ్వేత తండ్రితో ఫోన్లో మాట్లాడిన పోలీసులు .. శ్వేత క్షేమంగానే ఉందని తెలిపారు. అయితే తమ కోడలిన తమకు అప్పగించాలని శ్వేత అత్తామామలు, భర్త ప్రవీణ్​ పోలీసులను కోరారు.