
వాషింగ్టన్: ప్రెగ్నెంట్ను చంపి, ఆమె బిడ్డను తీసుకొని పారిపోయిన మహిళకు మరణశిక్ష అమలుకు ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. అమెరికాలో ఒక మహిళకు మరణశిక్ష అమలు చేయడం 70 ఏళ్లలో ఇదే మొదటిసారి. దోషి లీజా మోంట్గోమరినీ ఇండియా టెర్ హట్లోని ఫెడరల్ కరెక్షనల్ కాంప్లెక్స్లో విషపు ఇంజక్షన్ ఇచ్చి శిక్షను అమలు చేస్తారు. ఈమె 2004 డిసెంబరులో లీజా బాబీ జో స్టినెట్అనే ప్రెగ్నెంట్ను గొంతు పిసికి చంపింది. ఆమె కడుపును కోసి బిడ్డను తీసుకొని పారిపోయింది. మరునాడే పోలీసులు ఈమెను అరెస్టు చేశారు. స్టినెట్ కూతురి వయసు ఇప్పుడు 16 ఏళ్లని పోలీసులు ప్రకటించారు. అనారోగ్య సమస్యల కారణంగా లీజాకు సంతానం కలిగే అవకాశం లేకపోవడంతో ఈ దారుణానికి పాల్పడిందని చెప్పారు. అయితే మానసిక అనారోగ్యం వల్లే ఆమె ఈ హత్య చేసిందన్న డిఫెన్స్ లాయర్ల వాదనను కోర్టు ఒప్పుకోలేదు.