టాటా ట్రస్ట్స్ ట్రస్టీగా మరోసారి వేణు శ్రీనివాసన్

టాటా ట్రస్ట్స్ ట్రస్టీగా మరోసారి వేణు  శ్రీనివాసన్

న్యూఢిల్లీ: టాటా ట్రస్ట్స్​ ట్రస్టీగా వేణు శ్రీనివాసన్​ను ఏకగ్రీవంగా జీవితకాలానికి తిరిగి నియమించింది. సంస్థలో అంతర్గత విభేదాలు ఉన్నాయనే నివేదికల మధ్య, ఇప్పుడు మెహ్లి మిస్త్రీ పునర్నియామకంపై దృష్టి మళ్లింది. శ్రీనివాసన్​ (టీవీఎస్​ గ్రూప్​ చైర్మన్​ ఎమెరిటస్​) పదవీకాలం అక్టోబర్​ 23తో ముగుస్తోంది. 

ప్రస్తుత చైర్మన్​ నోయెల్​ టాటాకు ఒక వర్గం, మాజీ పెద్దలకు మరో వర్గం మద్దతు ఇస్తుండటంతో టాటా ట్రస్ట్స్‌‌లో  చీలిక ఏర్పడిందని సమాచారం. మరో ట్రస్టీ మెహ్లి మిస్త్రీ పదవీకాలం ఈనెల 28తో ముగుస్తుంది. ఆయన కొనసాగింపు ఆటోమేటిక్​గా జరుగుతుందా లేక జీవితకాల పదవీకాలానికి ట్రస్టీల నుంచి ఏకగ్రీవ ఆమోదం అవసరమా ? అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

 ట్రస్ట్స్‌‌లో ఏకగ్రీవ ఆమోదం అవసరమని, లేకపోతే నోయెల్​ టాటా నియామకంతో సహా గత తీర్మానాలను కూడా తిరిగి పరిశీలించాల్సి ఉంటుందని ఒక వర్గం వాదిస్తోంది.