ఛత్తీస్ గఢ్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా..కేజీ గంజాయి సీజ్

ఛత్తీస్ గఢ్ నుంచి హైదరాబాద్ కు తరలిస్తుండగా..కేజీ గంజాయి సీజ్

హైదరాబాద్​ సిటీలో గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు జోరుగా సాగుతోంది.. సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, ఛత్తీస్​ గఢ్, కర్ణాటక లనుంచి గంజాయి తీసుకొచ్చి సిటీలో అమ్ముతున్నారు. పోలీసులు నిఘాపెట్టి తనిఖీ చేస్తూ  గంజాయి రవాణ,  విక్రయాలను అడ్డుకుంటున్నప్పటికీ గంజాయి దందా మాత్రం ఆగడం లేదు. గురువారం ( సెప్టెంబర్​25) ఛత్తీస గఢ్​ నుంచి హైదరాబాద్​ కు మోటారు బైక్​ పై గంజాయి తరలిస్తుండగా రంగారెడ్డి జిల్లా ఆగపల్లి దగ్గర పోలీసులు పట్టుకున్నారు.

రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి దగ్గర గంజాయి తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఎస్​వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. గంజాయి తరలిస్తున్న ఛత్తీస్​ గఢ్​ కు చెందిన ప్రమోద్​ కుమార్​ను పోలీసులు అరెస్ట్​ చేశారు. నిందితుడి దగ్గర నుంచి 1కేజీ గంజాయిని పట్టుకున్నారు. మరో వ్యక్తి ఒడిషాకు చెందిన కిరణ్​ నాయక్​ పరారీలో ఉన్నాడు. నిందితుడు ప్రమోద్​ ను మంచాల పోలీసులకు అప్పగించారు ఎస్​ వోటీ పోలీసులు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. 

►ALSO READ | కీసర కిడ్నాప్ కేసులో ట్విస్ట్.. పీఎస్ ఎదుట ఆందోళనకు దిగిన శ్వేత భర్త కుటుంబ సభ్యులు