ట్విట్టర్, ఇన్ స్టాలో ధనుష్ పేరు తొలగించిన ఐశ్వర్య

ట్విట్టర్, ఇన్ స్టాలో ధనుష్ పేరు తొలగించిన ఐశ్వర్య

కుటుంబ కలహాలు కలకాలం ఉంటాయా? ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్ ఎప్పటికైనా కలుసుకోకపోతారా అని ఆశగా ఎదురుచూశారు అభిమానులు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. ఇక ఎప్పటికీ తాము ఇద్దరం కలిసి జీవించే ప్రసక్తే లేదన్నట్టు కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసింది ఐశ్వర్య రజనీకాంత్. మొన్నటివరకు ట్విట్టర్,ఇన్ స్టాగ్రామ్ కు ఐశ్వర్య రజనీకాంత్ ధనుష్ అనే పేరు ఉండేది. వీరిద్దరూ విడిపోయిన తర్వాత కూడా ధనుష్ పేరును తొలగించకపోవడంతో వీరిద్దరూ ఎప్పటికైనా కలిసే ఉంటారని అనుకున్నారు. ఐశ్వర్య, ధనుష్ భార్యాభర్తలుగా కలిసి జీవిస్తారనే పుకార్లు షికారు చేశాయి. ఇంతలో ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఒక్కసారిగా ఐశ్వర్య అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ధనుష్ పేరును ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ నుంచి తొలగించింది. ఇప్పుడు ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ కు ధనుష్ పేరును తొలగించి ఐశ్వర్య రజనీకాంత్ గా మార్చుకున్నారు. దాదాపు 17 ఏళ్ల వివాహబంధానికి ముగింపు పలుకుతూ జనవరి 17న ఐశ్వర్య, ధనుష్ విడిపోతున్నట్టు ప్రకటించడంతో అభిమానులను షాక్ కు గురిచేశారు. ఇప్పుడు కూడా ఐశ్వర్య తీసుకున్న నిర్ణయంతో చివరి ఆశలు కూడా ఆవిరైపోయాయి.

మరిన్ని వార్తల కోసం

ఎండలోనే బస్సుల కోసం ఎదురుచూపులు

కరెంట్​ చార్జీల బాదుడు