
ఉక్రెయిన్ పై రష్యా యుద్దం 14 రోజులగా సాగుతోంది. ఈ భీకర పోరులో ఉక్రెయిన్ లోని కీలక ప్రాంతాలపై పట్టు సాధించామని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది. చెర్నోబిల్, జపొరోజియా న్యూక్లియర్ పవర్ ప్లాంట్లను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నామని చెప్పింది. ఉక్రెయిన్ అణు యుద్ధానికి దిగే ప్రమాదం ఉండకూడదనే ముందస్తు చర్యల్లో భాగంగా వాటిపై తాము పట్టు సాధించామని స్పష్టం చేసింది. ఉక్రెయిన్ చేతిలో ఈ న్యూక్లియర్ ప్లాంట్స్ ఉంటే అణు దాడులు చేస్తామంటూ బెదిరింపులకు దిగే ప్రమాదం ఉందని పేర్కొంది. కాగా, రష్యా గుప్పిట ఉన్న చెర్నోబిల్ అణు విద్యుత్తు కేంద్రం పర్యవేక్షణపై ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఆందోళన వ్యక్తం చేసింది. చెర్నోబిల్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లో ఏర్పాటు చేసిన పర్యవేక్షణ వ్యవస్థ నుంచి డేటా ట్రాన్సిమిషన్ ఆగిపోయినట్లు తెలిపింది.
?#Zakharova: During the special operation in Ukraine, control has been established over the Chernobyl and Zaporozhye nuclear power plants.
— MFA Russia ?? (@mfa_russia) March 9, 2022
❗️This was done exclusively to prevent any attempts to stage nuclear provocations, which is a risk that obviously exists pic.twitter.com/cv4m5xmoWp
మరోవైపు.. ఇంటర్నేషనల్ కోర్టులో ఉక్రెయిన్ వేసిన పిటిషన్ పై జరిగే వాదనలకు హాజరుకావొద్దని నిర్ణయించినట్టు రష్యా విదేశాంగశాఖ తెలిపింది. అటు.. తమపై అమెరికా ఆర్థిక యుద్ధం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.