కాశ్మీర్‌‌పై పాకిస్తాన్‌‌ సెల్ఫ్‌‌గోల్‌‌ చేసుకుందా?

కాశ్మీర్‌‌పై పాకిస్తాన్‌‌ సెల్ఫ్‌‌గోల్‌‌ చేసుకుందా?
  • పరోక్షంగా తన తప్పులు.. తనే బయటపెట్టుకుంటోంది

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్​కు స్పెషల్​ స్టేటస్​ పునరుద్ధరించాలంటూ పాకిస్తాన్​ చేస్తున్న వాదన ఇండియాకే అనుకూలమని నిపుణులు చెబుతున్నారు. ఆర్టికల్​ 370 రద్దును వ్యతిరేకించడమంటే.. లీగల్​గా జమ్మూకాశ్మీర్​ ఇండియాదేనని పరోక్షంగా ఒప్పుకున్నట్లే అంటున్నారు. దేశ విభజన సమయంలో జరిగిన ఒప్పందం సబబేనని పాకిస్తాన్​ప్రపంచానికి చాటుతోందన్నారు. జమ్మూకాశ్మీర్​ విలీనం సందర్భంగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వం ఆ రాష్ట్రానికి  స్పెషల్​ స్టేటస్​ కల్పించింది. ప్రత్యేక రాజ్యాంగం, ప్రత్యేక జెండా, స్పెషల్​ పీనల్​కోడ్ లతో పాటు ప్రజల జీవనానికి సంబంధించి కాశ్మీర్​ ప్రత్యేకతను కలిగి ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 370  ద్వారా కాశ్మీర్​కు ఈ స్పెషల్​ స్టేటస్ ను పొందుతోంది. ఈ ఒప్పందాన్ని పాక్​అప్పట్లోనే వ్యతిరేకించింది. దీనిని గుర్తించబోమని ప్రకటించింది. నిన్న, మొన్నటి వరకూ పాక్​ ఇదే స్టాండ్​పై ఉంది. అయితే, ఆగస్టు 5న కేంద్రం ఈ ఆర్టికల్​ 370ని రద్దు చేయడంతో పాక్​ మాటమార్చింది. రద్దు నిర్ణయాన్ని తప్పుబడుతూ, కాశ్మీర్​లో అంతకుముందున్న పరిస్థితినే కొనసాగించాలని డిమాండ్​ చేస్తోంది. ఈ విషయంపై ప్రపంచ దేశాల మద్ధతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఒక్క చైనా మినహా మిగతా దేశాలేవీ సమర్థించకపోయినా పాక్​ పట్టువీడడంలేదు. పలు అంతర్జాతీయ వేదికలపై ఈ విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తోంది. ఈ ప్రచారం ఇండియాకే లాభిస్తుందని రాజకీయ నిపుణులు అంటున్నారు.

అదెలాగంటే…

  • తొలుత జమ్మూకాశ్మీర్, ఇండియాల మధ్య జరిగిన విలీన ఒప్పందాన్ని గుర్తించబోమన్న పాక్​ ఇప్పుడు ఆర్టికల్​370 రద్దు అన్యాయమని వాదిస్తోంది. అంటే.. ఈ ఒప్పందాన్ని గుర్తించినట్లే. దానర్థం మొత్తం కాశ్మీర్  ఇండియాదేనని అధికారికంగా ఒప్పుకున్నట్లే.
  • ఇండియా, పాక్​ల మధ్య అసలు వివాదం కేవలం పాక్​ఆక్రమిత కాశ్మీర్(పీవోకే) అంశంపైనేనని ప్రపంచానికి చాటిచెప్పడమే!
  • పీవోకేలోని ప్రజలను పాక్​ అణిచివేస్తోంది.. పాక్​ భూభాగంలోని ప్రజలతో పోలిస్తే పీవోకేలో నివసించే వారు అనేక ఆంక్షల నడుమ బతుకుతున్నారు. కాశ్మీర్​కు స్పెషల్​స్టేటస్​అంశంపై పాక్​ చేస్తున్న వాదన పీవోకే కూ వర్తిస్తుంది.
  • పాకిస్తాన్​ వాదన తన మిత్రదేశం చైనాకూ ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. చైనా ఆక్రమించిన అక్సాయ్​ చిన్​ ప్రాంతానికీ పాక్​ వాదన వర్తిస్తుంది. అంటే.. పాక్​ను సమర్థించడమంటే అక్సాయ్​ చిన్​ ప్రాంతాన్ని ఇల్లీగల్​గా ఆక్రమించినట్లు చైనా అంగీకరించినట్లవుతుంది. అందుకే కాశ్మీర్​ విషయంలో ముందు పాక్​ను సమర్థించిన చైనా.. తర్వాత జోరు తగ్గించింది. ఇండియా, పాక్​లు చర్చలతో పరిష్కరించుకోవాలని చెబుతోంది.
  •  షాక్స్​గం వ్యాలీలోని దాదాపు ఆరు వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని పాక్​ గతంలో చైనాకు బహుమతిగా ఇచ్చింది. ఆర్టికల్​ 370 రద్దును తప్పుబట్టడమంటే.. సదరు బహుమతి కూడా అక్రమమేనని స్వయంగా అంగీకరించినట్లేనని నిపుణులు చెబుతున్నారు. బలవంతంగా ఇతరుల ఆస్తులను స్వాధీనం చేసుకొని, అన్యాయమని తెలిసీ దానిని ఇతరులకు అమ్మడమేనంటున్నారు.
  • చివరగా.. కాశ్మీర్​ స్పెషల్​ స్టేటస్​కొనసాగించాలన్న డిమాండ్, లోయలో టెర్రరిజాన్ని ప్రోత్సహించడం వంటి పనులతో.. ఉద్దేశపూర్వకంగానే ఇతర దేశాల వ్యవహారాల్లో తలదూర్చడమే తన పని అంటూ పాక్​ తనకుతానుగా ప్రపంచానికి చెప్పుకున్నట్లు అవుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇవన్నీ పరోక్షంగా ఇండియాకు మేలుకలిగించేవేనని అంటున్నారు.  
  • బోర్డర్లో పాక్‌‌‌‌‌‌‌‌ సైన్యాల మోహరింపురాజస్థాన్‌‌‌‌‌‌‌‌, సియాల్‌‌‌‌‌‌‌‌కోట్‌‌‌‌‌‌‌‌-జమ్మూ సెక్టార్ల లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌ సైన్యాన్ని భారీగా  మోహరించిందని ఇంటెలిజెన్స్‌‌‌‌‌‌‌‌ వర్గాలు కేంద్ర సర్కార్‌‌‌‌‌‌‌‌ను హెచ్చరించింది. మనపై టెర్రర్‌‌‌‌‌‌‌‌ ఎటాక్‌‌‌‌‌‌‌‌ జరిగే అవకాశముందని  కూడా ఐబీ వార్నింగ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చింది. దీంతో బోర్డర్‌‌‌‌‌‌‌‌లో మన సైన్యాలను కూడా కేంద్రం అప్రమత్తం చేసింది.