ఐదో రోజు ముగిసిన రాహుల్​ విచారణ

ఐదో రోజు ముగిసిన రాహుల్​ విచారణ

ఢిల్లీ :  ‘నేషనల్​ హెరాల్డ్’  మనీలాండరింగ్​ కేసులో  కాంగ్రెస్​ నేత రాహుల్ గాంధీని  ఐదో రోజు (మంగళవారం) కూడా  ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ ) విచారించింది. దాదాపు 10 గంటలపాటు ఏకధాటిగా  ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. ప్రధానంగా అసోసియేటెడ్​ జర్నల్స్​ లిమిటెడ్​ (ఏజేఎల్‌)లో సోనియా, రాహుల్ వాటా ఎంత?  సంస్థలో ఇంకా ఎవరెవరికి షేర్లు ఉన్నాయి?  ఏజేఎల్ సంస్థకు కాంగ్రెస్ ఇచ్చిన నిధులెంత? అప్పులు, ఆస్తుల వివరాలేంటి? వంటి అంశాలపై రాహుల్‌ ను  ఈడీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మొత్తం 50  గంటలపాటు ఈడీ విచారణను  రాహుల్​ ఎదుర్కొన్నారు.  మరోవైపు ఇదే కేసులో జూన్ 23న విచారణకు హాజరుకావాలంటూ సోనియాగాంధీకి ఈడీ సమన్లు జారీ చేసింది.