స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో నిర్మించిన ‘పుష్ప’ సినిమా ఐదు షోలు వేసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. రేపు (డిసెంబర్ 17న) ప్రపంచ వ్యాప్తంగా సినిమా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. సుమారు మూడు వేలకుపైగా థియేటర్లలో సినిమా విడుదల చేస్తున్నారు. మంచి ఓపెనింగ్స్ రాబట్టుకునేందుకు సినిమా యూనిట్ బెనిఫిట్ షోలకు అనుమతి కోరగా.. తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 5 ఆటలు ప్రదర్శించేందుకు అనుమతిచ్చింది. అల్లుఅర్జున్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ సినిమా విడుదల కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో సినిమా భారీ ఓపెనింగ్స్ సాధించే అవకాశం ఏర్పడింది.
FOR MORE NEWS:
జాబ్స్ పేరుతో మోసం.. మంత్రి ఎమ్మెల్యేల హస్తం
ఐటీ అధికారుల పేరుతో మోసం చేసిన ముఠా అరెస్ట్
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. ఆఫీస్ రిటర్న్ ఇప్పట్లో లేనట్లే..