పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో స్పీడ్ పెంచుతున్నాడు. సినిమాలకు గుడ్ బై చెప్పేశాడనుకున్న పవన్ ‘వకీల్ సాబ్’గా
రీఎంట్రీ ఇచ్చి గ్యాప్ లేకుండా సినిమాలను అంగీకరిస్తున్నాడు. ప్రస్తుతం వేణుశ్రీరామ్ దర్శకత్వంలో నటిస్తున్న పీకే, తర్వాత క్రిష్
డైరెక్షన్లో ఓ సినిమా, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో సినిమాలో నటించాల్సి ఉంది. తాజాగా పూరి జగన్నాథ్ డైరెక్షన్లో పవన్ నటించనున్నాడని టాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్ల క్రితం పూరి ‘జనగణమన’ అనే స్క్రిప్ట్ని మహేశ్ బాబుతో
తెరకెక్కించాలని చూశాడు. కానీ మహేశ్ ఆ సినిమా నుంచి తప్పుకున్నాడు. అదే కథను పవన్ కళ్యాణ్తో చేయాలని పూరి ప్లాన్
చేశాడని సమాచారం. ఆ కథలో పవన్ సీఎంగా కనిపిస్తాడట. ఈ కథకు పవన్ కళ్యాణ్ సరిగ్గా సరిపోతాడని ఎలాగైనా అతనితోనే
చేయాలని పూరి భావిస్తున్నాడట. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. గతంలో వీరి కాంబోలో ‘బద్రి’,‘కెమెరామెన్ గంగతో
రాంబాబు’ చిత్రాలు వచ్చాయి. ఈ వార్త నిజమైతే వీరి కాంబోలో మూడో సినిమా చూడొచ్చనమాట.
For More News..