న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారి రాబర్ట్ వాద్రా గురువారం మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. ప్రియాంక గాంధీ స్వయంగా వాద్రాను ఈడీ ఆఫీసులో డ్రాప్ చేసివెళ్లారు. విచారణకు హాజరయ్యే ముందు వాద్రా సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. ‘‘ఇప్పటిదాకా 11 సార్లు పిలిచారు. 70 గంటలపాటు ప్రశ్నించారు. నాపై మోపిన తప్పుడు ఆరోపణలు కొట్టుకుపోయి, నిర్దోషిగా తేలేదాకా ఎప్పుడు రమ్మంటే అప్పుడు ఈడీ విచారణకు వస్తూనేఉంటా’’అని వాద్రా పేర్కొన్నారు. ఇదిలాఉంటే, ఎయిర్సెల్ మ్యాక్సిస్ కేసులో నిదితులైన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి. చిదంబరం, ఆయన కొడుకు కార్తీ చిదంబరానికి ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. వాళ్లిద్దరినీ ఆగస్టు 1వరకు అరెస్టు చేయొద్దని కోర్టు సీబీఐని ఆదేశించింది.
నీరవ్ మోడీ రిమాండ్ పొడగింపు
లండన్: పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) స్కామ్లో అరెస్టు అయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ రిమాండ్ను లండన్ కోర్టు జూన్ 27 వరకు పొడిగించింది. నీరవ్ బెయిల్ పిటిషన్ను గురువారం విచారించిన వెస్ట్ మినిస్టర్ కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. నీరవ్ను ఏ జైల్లో ఉంచాలనే విషయంపై 14 రోజుల్లో నిర్ణయం చెప్పాలని ఇండియా అధికారుల్ని ఆదేశించింది. పీఎన్బీ స్కామ్లో ప్రధాని నిందితుడైన మోడీని స్కాట్ ల్యాండ్ యార్డ్ పోలీసులు లండన్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే.